ఆంధ్రదేశం

అరవై వసంతాల సమైక్యం
ఆరిపోతుంటే చూస్తూ మిగిలి పోవాలా ?
తల, మొండెం వేరు చేసి తెలివైన విభజనంటుంటే
మెదడులేని పశువులాగా తలాడించెయాలా?
మిరిమిట్లు గొలిపే మెరుపులై ఆకాశాన్ని జ్వలించాలి
నిప్పుల ఉప్పెనై
ఈ శిధిల నిర్ణయాన్ని, నియంతలనూ దహించేయాలి
మనోభావాల విలువ తెలియని మూర్ఖత్వాన్ని
కూకటి వ్రేళ్ళతో పెకిలించాలి
రాయలు ఏలిన రతనాల సీమ, మనది
కోటి రతనాల వీణ తెలంగాణ, మనది
ఆంధ్రులకు అస్తిత్వం కలిగించిన ఆంధ్ర, మనది
వాడెవ్వడు? వీడెవ్వాడు?
పంచేస్తాం, త్రుంచేస్తామంటూ
విలువలేని పలుకులు ఒలుకుతున్న
ఆ...కులుకుతున్న రాబందుల వలువలూడగొట్టు
పంచుతామంటే పళ్ళు రాలగొట్టు
తెలుగు తల్లి గుండె గాయమే చేస్తుంటే
జన వాహిని జగమెల్ల నినదిస్తుంది
సహస్ర కోటి గళాలు చేరి కుఠిల రాజకీయానికి చరమ గీతం పాడేస్తాయి
కేంద్రాలు, రాష్ట్రాలు, చట్టాలు, ఆ సభలు, ఈ సభలు
హృదయనుబంధాల్ని చెరపలేవు
ఈ మట్టి , ఈ నీరు, ఈ గాలి మనది
ఎవరూ పునర్నర్మించలేరు
మరియెవరు విభజించలేరు
తెలుగు జాతి పూజించు ప్రదేశమొకటే
ఆంధ్ర దేశమదొకటే 
ప్రజల అభీష్టానికి వ్యతిరేకమైన పాలనా,పాలకులు మనలేరు
చరిత్రలో ద్రోహులై మిగిలిపోతారు
సమైక్య ప్రభంజనంతో మూగవోతారు
మా తెలుగు తల్లికీ మల్లె పూదండ!
మన తెలుగువారికీ సమైక్యమే అండ!!

1 కామెంట్‌:

Add your comment here